సిరా న్యూస్,రాజన్నసిరిసిల్ల;
సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసారు. భక్తులకు లఘు దర్శనానికి అనుమతి నిచ్చారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మేడారం జాతరకు ముందు రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.