కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో కూడిన పూర్తి కమర్షియల్ చిత్రం ‘ఆదికేశవ’: చిత్ర బృందం

(సిరా న్యూస్);
అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందించదగ్గ పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేయడం కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘ఆదికేశవ’. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలు, జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. బుధవారం సాయంత్రం ఈ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఆదికేశవ’ విశేషాలను పంచుకోవడంతో పాటు, సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసింది. అనంతరం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి సమాధానమిచ్చారు

దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ, “కథ విని సినిమా చేయడానికి అంగీకరించిన వైష్ణవ్ గారికి, నాగవంశీ గారికి, చినబాబు(ఎస్. రాధాకృష్ణ) గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. కొత్తవారికి ఇది అవకాశం ఇచ్చినట్లు కాదు.. జీవితం ఇచ్చినట్లు. జి.వి. ప్రకాష్ గారు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు. పాటలు అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, అలాగే పాటలు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు.A4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *