సిరా న్యూస్,నిర్మల్;
తెలంగాణలో మరో మునిసిపల్ హస్తగతమయింది. తాజాగా ఖానాపూర్ మున్సిపల్ లో చెర్మెన్ ,వైస్ చెర్మెన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.దాంతో ఖానాపూర్ మున్సిపలిటిని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లయింది.పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతునిచ్చారు. ఇక్కడ 12 మంది కౌన్సిలర్లు వున్నారు. ఐదుగురు బిఅరెస్, ఐదుగురు కాంగ్రెస్, ఒకరు భాజపా, ఒకరు ఇండిపెండెంట్ వున్నారు. కాంగ్రెస్ అభ్యర్ది కితొమ్మిది మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది.