మంత్రి తుమ్మల
సిరా న్యూస్,ఖమ్మం;
నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ అడ్మిషన్స్,అవసరాలు,సమస్యలు తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేసారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తాత్కాలిక కాలేజీగా పాత కలెక్టరేట్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నము. వారి వసతులు సౌకర్యాలు తెలుసుకొని భవిష్యత్తులో నూతన నిర్మాణానికి కావాల్సిన స్థలం, భావనల విషయంలో కలెక్టర్ ,మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నివేదిక తయారు చేయాలి. 108 కోట్లతో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు వస్తాయి. అందువల్ల భవిష్యత్ తరాలు మెచ్చే విధంగా అందరికీ సౌకర్యవంతమైనమెడికల్ కాలేజీ నిర్మించాలని అన్నారు.