నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని విద్యానగర్ పూసలవాడ సచివాలయం ముందు ఆందోళన..

సిపిఎం
.
నివాసం ఉన్న ఇండ్లకు ఇంటి పట్టాలు ఇవ్వాలి… సిపిఎం

సిరా న్యూస్,బద్వేలు;
రాష్ట్ర ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతాం… సిపిఎం
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలు ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే నివాసమున్న ఇండ్లకు ఇంటి పట్టాలివ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ ) సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్ లో ఉన్నటువంటి సచివాలయం పూసలవాడ లో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఈరోజు పేద ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని మాట్లాడుతూ…. బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు అయినటువంటి ప్రజలు సుందరయ్య కాలనీ పూసలవాడ జ్యోతిబసు కాలనీ ఐలమ్మ కాలనీ మహమ్మద్ కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలు బాడుగలు కట్టలేక చాలీచాలని కూలితో బ్రతుకుతున్నారని వారికి ప్రభుత్వం వారు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించి వారికి ఇవ్వాలని అలాగే సొంత ఇల్లు ఉండి కొన్ని సంవత్సరాల నుండి కాపురం చేస్తూ వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో అనేకమంది ప్రజలు బాడుగలు కట్టలేక సొంత ఇల్లు లేకపోవడంతో కష్టాలు పడుతున్నారని వారు తెలిపారు ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయించామని కాలనీలు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నప్పటికీ వారి ప్రభుత్వంలో వారి కార్యకర్తలకు మాత్రమే ఇంటి స్థలాలు ఇచ్చారని మిగతా వారికి ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు భూకబ్జా దారుల చేతుల్లో ఉన్నాయని వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ స్థలాలను ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకొని నిరుపేదలైనటువంటి బాడుగ ఇండ్లలో ఉన్నటువంటి వారికి తక్షణమే ఇంటి పట్టాలి ఇచ్చి వారికి న్యాయం చేయాలని వారు కోరారు అలాగే ఏళ్లు తరబడి సొంత ఇంటికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇవ్వకపోవడం దారుణం అన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు స్పందించి నిరుపేదలైనటువంటి ప్రజలకు తక్షణమే స్థలాలు కేటాయించాలని అలాగే నివాసమున్న ఇండ్లకు ఇంటి పట్టాలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించకపోతే పేద ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగనపల్లి నాగార్జున ఆంజనేయులు బాల గురయ్యా రాయప్ప రాజగోపాల్ అనంతమ్మ బాలమ్మ మోక్షమ్మ కైరున్ బి మస్తాన్ బి ఫాతిమా నాగమ్మ గంప సుబ్బరాయుడు ముస్తఫా రాయప్ప తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి అర్జీలకు స్పందించకపోతే పెద్ద ఎత్తున 35 వార్డ్ లో ఉన్నటువంటి ప్రజలతో ఆర్డిఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *