సూర్యపేట, సిరా న్యూస్
గానుగబండ సంచార జాతి బిడ్డకు ఓయూ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగంలో తాళ్ల శ్రీను డాక్టరేట్ సాధించారు. ఆచార్య ఎం గోనా నాయక్ పర్యవేక్షణలో “బిక్షుకుంట్ల వారి మౌఖిక సాహిత్యం- సంస్కృతి” అనే అంశంపై శ్రీను పరిశోధన పూర్తి చేసి సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్ డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన ఆయన తెలుగు విభాగంలో జాతీయ స్థాయి ఫెలోషిప్ కు ఎంపికై పీహెచ్ డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు విద్యార్థి నాయకులు, పరిశోధక విద్యార్థి మిత్రులు,సంచారజాతుల సంఘం అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్, నిమ్మల శ్రీనివాస్( టీచర్), కుటుంబ సభ్యులు అభినందించారు.