ఓఆర్ఆర్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 6 దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో రెండు కార్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.సోమవారం అర్ధరాత్రి మేడ్చల్ ఓఆర్ఆర్ లో ఇన్నోవా కార్ వస్తుండగా ఎదురుగా వస్తున్న ఎస్యూవి కార్ ఢీ కొంది. ఒక వ్యక్తి అక్కడి అక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ప్రాధమిక దర్యాప్తులో సంఘటన స్ధలం మృతి చెందిన మృతుడు వనస్థలిపురం కి చెందిన రెడ్డప్ప రెడ్డి గా గుర్తించారు. ఘటనలో ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. కారు నుజ్హు నుజ్జై అందులోని రెడ్డప్ప రెడ్డి అక్కడి అక్కడే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *