18 మంది ప్రయాణికులకు గాయాలు
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి సమీపంలోని బాలాజీ డైరీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బస్సు బోల్తా పడింది.18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు రుయా హాస్పిటల్ కు తరలించారు. తిరువణ్ణామలై నుంచి 42 మంది ప్రయాణికులతో తిరుపతి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా ఘటనకు కారణమైన టిప్పర్ ను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ఎం.అర్.పల్లి పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.