ఇంద్రవెల్లి, సిరా న్యూస్
పెళ్లి చేసుకునే ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో మేలు చేస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో 42 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సంక్షేమం పాటుపడుతుందని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.