సిరా న్యూస్,జగ్గయ్యపేట;
వత్సవాయి మండలం లింగాల గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్, అయన తమ్ముడు రవి ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో రెండు అంతస్తుల భవనం లోని అన్ని గదుల్లోను దొంగలు చోరీకి పాల్పడ్డారు. గదుల్లోని బీరువాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి చోరీ చేసిన పోలీసులు గుర్తించారు. దోపిడీ కి వినియోగించిన గడ్డపలుగు ను దారి లో నే వదిలివెళ్లిపోయారు. అయన కుటుంబం హైదరాబాద్ లో నివాసముంటుంది. మంగళవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు, పోలీసులకు పిర్యాదు చేసారు.