వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు పట్టణంలో మంగళవారం ఉదయం 45 లక్షల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నగదుకు సంబంధించిన వివరాలు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ యుగంధర్ రూరల్ సీఐ విక్రమ సింహ రూరల్ ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు
బద్వేల్ పట్టణం గాంధీనగర్లో నివాసముంటున్న పి మల్లేష్ కువైట్ లో ఉండే వెంకటసుబ్బయ్య సూచన మేరకు మంగళవారం తెల్లవారుజామున బద్వేల్ నుండి నెల్లూరుకు వెళ్లాడు నెల్లూరు రైల్వే స్టేషన్ లో నరసింహ అనే వ్యక్తిని కలసి అతని వద్ద నుండి ఎటువంటి అకౌంటు లేని 45 లక్షల రూపాయలు తీసుకొని నెల్లూరు నుండి బద్వేల్ కు ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు గోపవరం మండలం పి పి కుంట చెక్పోస్ట్ వద్ద రూరల్ సీఐ రూరల్ ఎస్సై రూరల్ ఏఎస్ఐ భూపాల్ రెడ్డి కానిస్టేబుల్ అమర్నాథ్ రెడ్డి బస్సులో తనిఖీలు చేయగా మల్లేష్ వద్ద ఉన్న బ్యాగును తెరిచి చూడగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడినట్లు తెలిపారు నగదు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పంచనామ జరిపి ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని డి.ఎస్.పి తెలిపారు