చిగురుమామిడి, సిరా న్యూస్
16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ భారత్ బందులో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తెలంగాణ ఆశ వర్కర్స్ (సీఐటీ యూ) యూనియన్ చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ విప్లవ శ్రీకీ సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశ వర్కర్లకు అన్యాయం చేస్తుందని వాపోయారు. ఆశలతో 18 సంవత్సరాల నుంచి వెట్టిచాకిరీ చేయించుకుంటుందన్నారు. ఆశలను కార్మికులుగా గుర్తించడం లేదని దుయ్యబట్టారు. వేతనాలు సరిగా ఇవ్వడం లేదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆశవర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు పెద్దపల్లి శోభ, ప్రధాన కార్యదర్శి నాగెల్లి పద్మ, కమల, పద్మ, తారలు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.