సిరా న్యూస్, బేల:
ఉదారత చాటుకున్న బేల జై హనుమాన్ ఫర్టిలైజర్స్ యజమానులు…
+ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేత
అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జై హనుమాన్ ఫర్టిలైజర్స్ యజమానులు ఇట్టాడి రాజా రెడ్డి, సుశాంత్ రెడ్డి తమ ఉదారత చాటుకున్నారు.
బేల మండలం అవాల్ పూర్ గ్రామానికి చెందిన ఎల్మల నర్సమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందడంతో, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి కుమారులు ఎల్మల ముత్తన్న, భుమన్న లకు రు. 4 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి బాసటగా నిలవాలని సదుద్దేశంతో ఆర్థిక సాయం అందజేసినట్లు వారు తెలిపారు.