జయశంకర్ భూపాలపల్లి,(సిరా న్యూస్);
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని
సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్ అన్నారు.గురువారం ఢిల్లీ నుండి సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% , గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలో 60% వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.