సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలోని 44 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పశువుల లోడుతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 30 మూగజీవాలతో పాటు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న 1033 హైవే పెట్రోల్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో మృతి చెందిన మూగజీవాలను బయటికి తీశారు.అనంతరం వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం నుండి అనంతపురం వైపుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.