టోల్ గేట్ సిబ్బందిపై వైకాపా నేత దాడి

సిరా న్యూస్,రాయచోటీ;
రాయచోటి సమీపంలో వైసీపీ నాయకుడి దౌర్జన్యం బయటపడింది. బండపల్లి టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు దాడి చేసాడు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు, అనుచరుల దాడికి దిగారు. గేట్ తీయాలంటూ సిబ్బందిని దూషిస్తూ నాయకుడు వీరంగం సృష్టించాడు. గేటు తీసేలోపు సిబ్బందిని వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు చితకబాదారు. పక్కనే ఉన్న మరో టోల్గేట్ సిబ్బందినీ చితకబాదారు. ఘటనలో టోల్గేట్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *