సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ. గత 15 రోజులుగా రాజన్న ఆలయంలో ప్రతిరోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే, హుండీలో కానుకలు, నగదు సమర్పిస్తారు. 14 రోజుల హుండీ లెక్కింపులో నగదు రూపేనా 2 కోట్ల 15 లక్షల 67 వేల 130 రూపాయలు, 71 గ్రాముల 500 మిల్లి గ్రాముల బంగారం, 13 కిలోల 600 గ్రాముల వెండి రికార్డు స్థాయిలో సమకూరింది. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, సిబ్బందితోపాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.