-ప్రధాన పార్టీలు మాదిగలను విస్మరిస్తే మా తడాఖా చూపిస్తాం
-ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బాపయ్య
సిరా న్యూస్,మంథని;
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా మాదిగలనుకు అన్యాయం చేసే దిశగా పార్టీలు పావులు కలిపాయని ఈసారి మాదిగలను విస్మరిస్తే మా తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో ప్రధాన పార్టీలు ఎస్సీ సామాజిక వర్గంలోని ఎవరికి ఎంపీ టికెట్ కేటాయించిన వారికి మా పూర్తి మద్దతు తెలిపి గెలిపించుకున్న సందర్భాలు మావి అని పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సుమారు రెండు లక్షల 50 వేల పైచిలుకు మాదిగ ఓటర్లు ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించి ఇతర పార్టీలకు టికెట్లు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ కేటాయించాలని లేనియెడల ప్రధాన పార్టీల గడపల వద్ద చావు డప్పు మోగిస్తామని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలు సమావేశం చేసి స్థానిక మాదిగలకు పార్లమెంటు టికెట్టు ఇచ్చేలా చూడాలని ఆయన సూచించారు. ప్రధాన పార్టీ నాయకులు మాదిగ సామాజిక వర్గాలకు అన్యాయం చేసే దిశగా పావులు కలిపి టికెట్లు కేటాయించకపోతే వారి అభ్యర్థులను ఓడించడంలో తాము ముందుంటామని హెచ్చరించారు అంతేకాకుండా ప్రధాన పార్టీలు మాదిగలకు ఎంపీ టికెట్ కేటాయించని ఎడల మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పాపయ్య, నాతరి ప్రభాకర్, కాంపెల్లి ప్రభాకర్, పల్లె సదానందం, సంకెనపల్లి లక్ష్మయ్య, తగరం శంకర్ లాల్, అక్కపాక సంపత్, వేల్పుల సురేష్, బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు