సిరా న్యూస్,మంథని;
జాతీయ రహదారి నెం.163జీ నిర్మాణము కొరకు చేయు భూసేకరణలో భాగముగా రామగిరి మండలము బేగంపేట గ్రామంలో మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి వి. హనుమ నాయక్ సమావేశాన్ని నిర్వహించారు.
గురువారం బేగంపేట్ గ్రామ పంచాయతి కార్యాలయములో బేగంపేట్ గ్రామములో భూసేకరణ సంభందించి అవార్డు విచారణ నిర్వహించారు. ఈ సమావేశం లో భూమికి నష్టపరిహారం ఆర్ఎఫ్సిటి ఎల్ఏ ఆర్ఆర్ 2013 చట్టం ప్రకారం చెల్లించడం జరుగుతుందని ఆర్డిఓ తెలిపారు. ఇట్టి సమావేశంలో రైతులు అడిగిన ప్రశ్నలకు ఆర్డిఓ నివృతి చేసారు. ఇట్టి కార్యక్రమములో స్పెషల్ ఆఫీసర్, తహశీల్దార్ రాంచందర్ రావు, నావాబ్ పేట మాజీ సర్పంచ్ గాజుల ప్రశాంతి,బేగంపేట్ మాజీ సర్పంచ్ బుర్ర పద్మ, ఆర్ఐ రాజబాబు, భూ నిర్వాసితులు, ప్రజలు పాల్గొన్నారు.