దుబ్బాకలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

సిరా న్యూస్,దుబ్బాక;
గురువారం నాడు దుబ్బాక పట్టణంలో ని బస్టాండ్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,పద్మ శ్రీ డాక్టర్ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు,దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి ఇల్లెందు రమేష్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు పార్టీలకతీతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లెందు రమేష్ మాట్లాడుతూ మాహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని దుబ్బాక లో ఆవిష్కరించడం చాలా సంతోషమని ఇది నా అదృష్టం గా భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు.తెలుగుదేశంపార్టీ ని స్థాపించిన 9 నెలలలో నే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోరం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత స్వర్గీయఎన్టీఆర్ గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలిపారు.బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి రాజకీయంగా,ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన నాయకులు ఎన్టీఆర్ గారు అని తెలిపారు. కూడు, గుడ్డ,గూడు అని నినాదం తో రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యంగా తెలంగాణా లో పటేల్ పట్వారీ వ్యవ్యస్థ ను రూపుమాపి పేదలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి,తెలంగాణ లో బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్ర్యము ఇచ్చిన నాయకులు మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా వెంటనే కేంద్ర ప్రభుత్వంస్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ,దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి ఇల్లెందు ల రమేష్ గారి తో పాటు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆకుల రాములు,పార్లమెంట్ కార్యదర్శి సాంబాగా లక్ష్మణ్ జిల్లా బిసి సెల్ అధ్యక్షులు పెంబర్తి భాస్కర్ ,జిల్లా యస్ టి సెల్ అధ్యక్షులు కురాకుల మహేష్ సత్యం ఎస్సీ సెల్ అధ్యక్షులు జిడిపల్లి లింగం,,మండల అధ్యక్షులు శంకర్ గౌడ్,ర్యాకం రవీందర్,జహంగీర్, పి.రమేష్ ,శ్రీకాంత్, నాగభూషణం, పోచయ్య,నాయకులు అంజాగౌడ్,వల్లూరు నర్సింలు,దాసరి మల్లేశ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *