ఇచ్చోడ, సిరా న్యూస్
గోశాలకు విరాళం ఇచ్చిన పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రాజమౌళి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శ్రీరామ్ గోశాలకు ఆలిండియా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు రాజమౌళి రూ.24 వేల విరాళం అందజేశారు. గోశాల వ్యవస్థాపకుడు ఐద రాజేష్ ను కలిసి విరాళం అందించారు. గోమాత ఆశీస్సులు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిట్టపల్లి శంకరయ్య పాల్గొన్నారు.