ఆదిలాబాద్, సిరా న్యూస్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించే బాధ్యత కార్యకర్తలపై ఉందని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ,శక్తి వందన్ కార్యక్రమం రాష్ట్ర సమన్వయ కర్త సుహాసిని రెడ్డి అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన శక్తి వందన్ అభియాన్ వర్క్ షాప్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి, శక్తి వందన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రదాన కార్యదర్శి రాజేశ్వర రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రజినీ, వైద్య, జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేలు మంగ తదితరులున్నారు.