వైభవంగా మామిడిపల్లి లో జాతర

 సిరా న్యూస్,సిరిసిల్ల;
మాఘ అమావాస్య సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ దేవస్థానం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పటినుండి ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, గ్రామ కమిటీ వారు సైతం అభివృద్ధిలో పాలుపంచు కుంటున్నారని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో దేశంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నానని, రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత తీర్చిదిద్దామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *