సిరా న్యూస్,నెల్లూరు;
నాలుగు సంవత్సరాలుగా మినుము పంటలో వరుసగా నష్టాలను చవిచూసిన నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామని చెందిన పులివర్తి శ్రీనివాసులు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల భీమాలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామన్న పదే పదే చెప్పే వైసిపి సర్కార్ శ్రీనివాసులకి న్యాయం చేయలేకపోయింది. అప్పుల బాధలు తట్టుకోలేక భార్య ఇద్దరు పిల్లల్ని అనాధలు చేస్తూ శ్రీనివాసులు తనువు చాలించాడు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాధిత కుటుంబం అర్థిస్తుంది.