సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ

అధికార ప్రతినిధి ఎన్ డి విజయ జ్యోతి

సిరా న్యూస్,బద్వేలు;
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండి భారతదే శాన్ని సుదీర్ఘంగా పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నాయకులు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రి అయి కీర్తి గడించారని అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ డి విజయ జ్యోతి పేర్కొన్నారు.
కడప జిల్లా బద్వేల్ పట్టణం ఆర్ అండ్ బి బంగ్లాలో గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ డి విజయ జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎండి విజయ జ్యోతి ఎంపికైన సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు ఏఐసీ పార్టీ పెద్దలకు పిసిసి మీడియా చైర్మన్ ఎన్ తులసి రెడ్డి, పిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి జకరయ్య, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్సీ సత్తార్, కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నుంచి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది మహా నాయకులను తయారు చేసిందని ప్రజలకు మంచి పరిపాలన అందించిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్యుత రాజు,చిన్నపురెడ్డి, మహబూబాషా షరీఫ్, బండి జకరయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *