సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్ లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హజరయ్యారు. తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా సీఎం సమర్పించారు. తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.