సిరా న్యూస్,కావలి;
నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాదు నుండి కాళహస్తి వెళ్తున్న లారీని మరో లారీ.. అతివేగంతో వెనుక నుండి ఢీకొట్టింది. దాంతో ముందు వెళ్తున్న లారీ రోడ్డు పక్కకు పడిపోగా డ్రైవర్ మృతి చెందాడు. వెనక ఉన్న లారీ అదుపుతప్పి మరో మార్గంలో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఢీ కొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు వున్నారు. జాతీయ రహదారిపై ఇరువైపులా ప్రమాదం జరగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. క్షతగాత్రులను 108 వాహనాలలో కావలి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. నలుగురు పరిస్థితి విషమంగా వుంది.