గుడిహత్నూర్, సిరా న్యూస్
జిల్లా స్థాయి శక్తివందన్ అబియాన్ లో సుహాసిని రెడ్డి
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి బీజేపీ శ్రేణులు బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని శక్తి వందన్ రాష్ట్ర సమన్వయకర్త సుహాసిని రెడ్డి అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి శక్తివందన్ అభియాన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వారి మద్దతు కోరి, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యే విధంగా పనిచేయాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ నెల చివర్లో జరిగే నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ కి మండల స్థాయిలో స్వయం సహాయక సంఘాలు హాజరయ్యేలా చూడాలని కోరారు. అంతకుముందు నూతన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రావు,జిల్ల ప్రధాన కార్యదర్శి ఆడే మానాజి, అదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, ఇచ్చోడ జడ్పీటీసీ బాబురావు పటేల్, గుడిహత్నూర్ ఎంపీటీసీ భరత్, పలు మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు