రైతు అందోళన
సిరా న్యూస్,రంగారెడ్డి;
విద్యుత్ సమస్యతో వేగలేక పురుగుల మందు డబ్బాతో సబ్ స్టేషన్ ముందు రైతు ఆందోళన కు దిగారు. రంగారెడ్డి – మంచాల మండలం తిప్పాయిగూడకు చెందిన జెనిగె సత్తయ్య అనే రైతు బోరు మోటార్ విద్యుత్ సమస్యతో సక్రమంగా పనిచేయడం లేదు. విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కోరినా స్పందించలేదు. వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని పురుగుల మందు డబ్బాతో సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడు.