సిరా న్యూస్,హైదరాబాద్;
2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 2,04,523 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రెవెన్యూ మిగులు 5,944 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 32,557 కోట్ల రూపాయలు
సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 2,24,625 కోట్ల రూపాయలు, ఇందులో రెవెన్యూ వ్యయం 24,178 కోట్లు, సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతా మిగులు 9,031 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు 33,786 కోట్ల రూపాయలు
ఆరు గ్యారంటీల అమలుకు కేటాయించిన నిధులు రూ. 53196 కోట్లు
ఆరు గ్యారంటీలు- రూ. 53196 కోట్లు
ఐటీ శాఖ – రూ. 774 కోట్లు
పరిశ్రమల శాఖ- రూ. 2543 కోట్లు
మున్సిపల్ శాఖ – రూ. 11692 కోట్లు
పంచాయతీ రాజ్ – రూ. 40080 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ. 19746 కోట్లు
ఎస్టీ ఎస్సీ గురుకుల పాఠశాలల కోసం – రూ.1250కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ. 21874
ఎస్టీ సంక్షేమం – రూ. 13013 కోట్లు
బీసీ సంక్షేమం -రూ. 8000 కోట్లు
వైద్య రంగం – రూ. 11500 కోట్లు
గద్దర్ను గౌరవించడం అంటే ప్రజాగాయకులకు దక్కిన గౌరవం
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఇదే తాము ఇచ్చే నివేళి అన్నారు. గద్దర్ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్తృతిని, ప్రగతిల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు భట్టి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించ్ అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందజి. ఎంతో మంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించే అంసం కాదన్నారు.
అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేదించామన్నారు. ఎంతో కాలంగాణ పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికివంద ఎకరాల స్థలాన్ని కేటాయమైంది. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు మేం తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూసతుడటంతో సందేహం లేదు.
లకమైన శాఖలతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పుల వడ్డీలకే దాదాపు రెండున్నర కోట్ల లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే ఆ లెక్కలన్ను అంచనా వేసుకొన భారీ స్థాయిలో బడ్జెట్ రూపొందించారు. ఆ దశగానే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయిు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల 90 వేల కోట్ల రూపాయలతో 2023-24 బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చింది. అప్పటి ఖర్చులు, సంక్షేమంతో పోల్చుకుంటే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారాయి. ఆ లెక్కల ప్రకారమే బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రదాన హామీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. అందుకే వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలు పరుస్తున్నారు. ఇప్పుడు మరో రెండు అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. వీటితోపాటు మిగతా హామీల అమలు దిశగా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు.
ఉద్యోగాల కల్పనపై..
ఆరు గ్యారంటీల కోసం దాదాపు 70వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందుకే ప్రస్తుతం నాలుగు గ్యారంటీలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నందున ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు, ఐదు వందలకే గ్యాస్సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను పక్కాగా అమలు చేయాలి ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
నిధులు ఎలా
తెలంగాణను అప్పుల కుప్పగా బీఆర్ఎస్ మార్చేసిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు పథకాల అమలు, రాష్ట్ర పాలన కోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ వారంలోనే ఐదున్న వేల కోట్లు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఇన్ని పథకాల అమలు కోసం ఆదాయం ఎలా సమకూర్చనందో అన్న అనుమానం చాలా మందిలో ఉంది. దీని కోసం బడ్జెట్ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతోందో అన్న చర్చ అయితే నడుస్తోంది.
గతేడాది బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, మూలధన వ్యయం 37,525 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా 21,471 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41,259 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో కేంద్రం నుంచి గ్రాంట్ల వాటా తగ్గించి చూపించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఇది ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్పై చాలా ఆసక్తి మాత్రం ఉంది.