ఆదిలాబాద్, సిరా న్యూస్
అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్) అభివృద్ధి గురించి ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మాట్లాడారు. ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలిచారు. కళాశాలలో చదువుకున్న వారు తమ కళాశాలను గుర్తుంచుకుని ఎన్నో సేవలు అందిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.