సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్లో పూర్వ విద్యార్థుల సమావేశం
+ మార్చ్, ఎప్రిల్లలో జాతీయ స్థాయి సెమినార్ల ఏర్పాటుకు తీర్మాణం
+ కొత్త ప్రిన్సిపల్ శ్రీనివాస్కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభ్తుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన కాలేజీ పూర్వ విద్యార్థి శ్రీనివాస్ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న రోజుల్లో కళాశాలలో మార్చ్లో హిందీ, ఎప్రిల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టులలో జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కమీషనర్ బుర్ర వెంకటేష్కు విన్నవించామని ఆయన అన్నారు. కాలేజీలో లైబ్రరీ ఆధునీకరణ, ప్లే గ్రౌండ్ అభివృద్ధి, తదితర అంశాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్, కోశాధికారి నవీన్ యాదవ్, కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్, సభ్యులు సుహాసిని, సరిత, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.