సిరా న్యూస్, భీమదేవరపల్లి:
సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దు… ఎస్సై సాయిబాబు
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని ముల్కనూర్ ఎస్సై సాయిబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు ఎలాంటి కిడ్నాప్ ప్రయత్నాలు జరగలేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మండలంలో ప్రతిరోజు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు అని, ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు లోను కావద్దని సూచించారు. అనుమానస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.