PV Narasimha Rao: పీవీ కి భారతరత్న ప్రకటించడం సంతోషకరం…

సిరా న్యూస్, భీమదేవరపల్లి:

పీవీకి భారతరత్న ప్రకటించడం సంతోషకరం…

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సంతోషకరమని వంగర గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి దేవరాజు అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా భీమాదేవరపల్లి మండలం వంగర గ్రామంలో, పీవీ నరసింహారావు స్వగృహంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దేశం కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. భారత దేశాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిన మహా నాయకుడు పీవీ నరసింహారావు అని అన్నారు. ఇలాంటి మహా నాయకునికి భారతరత్న అందించడం యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *