వివిధ కమిటీల సారధుల ఎంపిక
సిరా న్యూస్,హైదరాబాద్;
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పై చర్చ జరిగింది. ఎన్నికల కమిటీ ఇప్పటికే రెండు మూడు సార్లు భేటీ అయింది. బీజేపీ తో టచ్ లో ఉన్న వారు, అభిప్రాయ సేకరణ లో వచ్చిన పేర్లు, సర్వే లలో వచ్చిన పేర్ల పై చర్చ జరిగింది. ఇతర పార్టీ లో ఉన్న వారితో ఎవరు మాట్లాడాలి అనే దాని పై చర్చ కొనసాగింది.. బీఆర్ఎస్, , కాంగ్రెస్ నేతలతో బీజేపీ నేతలు కుడా మట్లాడుతున్నాట్లు సమాచారం. …
మరోవైపు, పార్లమెంట్ ఎన్నికల కోసం వివిధ కమిటీల ను బీజేపీ వేసింది. 35 పైగా కమిటీ లని నియమచించింది. ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా కిషన్ రెడ్డీ, కన్వీనర్ గా లక్ష్మన్, కో కన్వీనర్ లుగా ఏవిఎన్ రెడ్డి, గరికపాటి, రామ చందర్ రావు, ఎన్నికల కార్యాలయం ప్రముఖ్ గా మాజీ ఎమ్మెల్సీ మాకం రంగారెడ్డి, సహా ప్రముఖ్ గా కే మాధవి, మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్ లక్ష్మన్, ఛార్జ్ షీట్ కమిటీ ప్రముఖ్ మురళి ధర్ రావు, మీడియా కమిటీ ప్రముఖ్ కృష్ణ సాగర్ రావు, మీడియా రిలేషన్స్ కమిటీ ప్రకాష్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ పోరెడ్డి కిషోర్ రెడ్డి, ఎలక్షన్ కమిషన్ , లీగల్ ఇష్యూస్ కమిటీ ఆంథోనీ రెడ్డిలను నియమించారు.