విద్యుత్ షాక్ తో కానిస్టేబుల్ మృతి
భూపాలపల్లి జిల్లా;
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు. వన్యమృగాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో మృతి చెందాడు. కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో ఈ ఘటన జరిగింది.
నస్తూర్ పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ కు అందింది. దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్, మరికొందరు సిబ్బందితో కలిసి కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపైవిచారణ ప్రారంభిచంఆరు. కరెంట్ ట్రాప్ ను పెట్టినవారి కోసం గాలిస్తున్నారు.