సిరా న్యూస్, ఆదిలాబాద్
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరి వీడాలి
-కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్
-కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్లెక్సీ దహనం
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరి వీడాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. సోమవారం
కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కృష్ణాజలాలపై కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసారు. ఈసందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ విషయంలో మాజీ సీయం కేసీఆర్ కు ఎంత సమయమైనా ఇస్తామని సీయం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే కేసీఆర్ అసెంబ్లీ కి రాకుండా అన్ని అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. చర్చకు అసెంబ్లీకి రాకుండా నల్గొండ సభ ఏర్పాటు ప్రజలను తప్పుదోవ పట్టించాడానికేనని ఆరోపించారు. ఇంకా ఎన్ని అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తావని ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కేసీఆర్ అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేసీఆర్ చేసిందేమీ లేదని మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నల్గొండ సభ పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.ప్రాజెక్టులు పూర్తిచేయకుండా రైతులకు సాగునీరు ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం మీదని ఆయన విమర్శించారు.తమది నిబద్దతతో పని చేసే ప్రభుత్వమని చక్కటి ప్రజా పాలన సాగుతుంటే చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,యాల్ల పోతా రెడ్డి,మైనారిటీ నాయకులు షకీల్,రషీద్ ఉల్ హాక్,రఫీక్, చారి, దామోదర్ రెడ్డి, కోరేటి కిషన్, గణపత్ రెడ్డి, బూర్ల శంకరయ్య,వేముల నాగరాజు, రంజిత్ రెడ్డి,ఖలీం,అన్నెల శంకర్,నవీన్ రెడ్డి,తిరుమల్ రెడ్డి, షేక్ మహమూద్, వెంకట్ రెడ్డి, ఉగ్గె సంతోష్, ఆయాస్, అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.