సహాయ కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ రెడ్డి

సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లా ధర్మ దేవదాయ శాఖలోని సహాయ కమిషనర్ గా పదోన్నతి పొందిన సుధాకర్ రెడ్డి సోమవారం సహాయ కమిషనర్ రామాంజనేయులు నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. తరువాత రం కార్యాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు. అనంతరం జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారిగా పదోన్నతి పై నియమించబడ్డ మద్దిలేటి రంగస్వామి దేవాలయ కార్య నిర్వహణ అధికారి పాండురంగారెడ్డి, ఉప కమిషనర్ గా పదోన్నతి పొందిన రామాంజనేయులు ఇరువురు కలిసి పాండురంగారెడ్డిని సన్మానించారు. పదోన్నతి పొంది మద్దిలేటి స్వామి దేవస్థానం ఈవోగా పదోన్నతి పొందిన డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు ను సుధాకర్ రెడ్డి దుశ్శ లవాతో ఘనంగా సన్మానించారు. త మ కార్యాలయంలో అధికారిగా పనిచేసి పదోన్నతి పై ఉపకమిషనర్ గా వెళ్లిన రామాంజనేయులు ఎంతో సహృదయుడని హుందాగా ఉండేవారని సిబ్బందిని కూడా ఆప్యాయత అనురాగాల తో మాట్లాడేవారని కార్యాలయ సిబ్బంది అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఏసీని పదోన్నతి పొందిన ఉప కమిషన్ ఘనంగా సన్మానించారు. వీరీ తో పాటు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం బళ్లారి చౌరస్తా ఈవో జమ్ములమ్మ మరియు ఓర్వకల్ గ్రూపు దేవస్థానాల కార్య నిర్వాహన అధికారి సీతారాం రెడ్డి మరియు గ్రేడ్ వన్ విశ్రాంత కార్యనిర్వాహణా దికారి సత్యనారాయణ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *