సిరా న్యూస్, కుందుర్పి
* గ్రామాల్లో ష్యూరిటీ బాండ్లను పంపిణీ
* ఉమాన్నను ఎంఎల్ఏ గా గెలిపించాలని విజ్ఞప్తి
ఆశయంతో పనిచేస్తున్న నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడును ఎమ్మేల్యేగా గెలిపించాలని టీడీపీ నాయకులు అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచనల మేరకు కుందుర్పి మండలంలోని క్లస్టర్-09లో, రుద్రంపల్లి, గురువేపల్లి, ఎనుములదొడ్డి గ్రామల్లో ష్యూరిటీభవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా స్థానిక ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి, ష్యూరిటీ బాండ్లను పంపిణీ చేశారు. ఆశయంతో పనిచేస్తున్నమాదినేని ఉమామహేశ్వర నాయుడు ఎమ్మేల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రుద్రంపల్లి ఎంపీటీసీ మమతా మల్లికార్జున, టీడీపీ నాయకులు వెంకటేషులు, ఉమేష్, ఎనుములదొడ్డి టీడీపీ నాయకులు చాంద్ భాష, వెట్టి హనుమంతరాయుడు, వీరేష్, వీరాంజి, బి.మంజు, ఎస్.మల్లాపురం నాగేంద్ర, జంబుగుంపల బీఎల్ఏ విజయ్ కుమార్, టీఎన్ ఎస్ ఎఫ్ కార్యదర్శి సునీల్ కుమార్, కొలిమిపాళ్యం గోవిందు, కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షులు జి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.