సిరా న్యూస్, కుందుర్పి:
యాదవ సంక్షేమ సంఘం కోసం కృషి
ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య
యాదవ సంక్షేమ సంఘం కోసం కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (సరోజ కంపౌండ్) లో యాదవ సంక్షేమ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా తలారి రంగయ్య మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మా గెలుపు కి కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన యాదవ సంక్షేమ సంఘం నాయకులు గెలుపు కచ్చితంగా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలిపారని అన్నారు. కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ , జిల్లా పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.