ICHODA FRO T. PUNDALIK : వన్యమృగం వేట కోసం విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు

సిరా న్యూస్, ఇచ్చోడ‌
వన్యమృగం వేట కోసం విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు
*ఇచ్చోడ ఎఫ్ఆర్ ఓ టి. పుండ‌లిక్‌
*బాధిత కుటుంబానికి నష్టపరిహారం అంద‌జేత‌

వన్యమృగం వేట కోసం విద్యుత్ తీగలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఇచ్చోడ ఎఫ్ఆర్ ఓ టి. పుండ‌లిక్ అన్నారు.
ఇటీవ‌ల గుడిహ‌త్నూర్ మండ‌లంలోని దామ‌న్‌గూడ‌కు చెందిన ఎం.కిష్ట‌న్న‌అనే రైతు కు చెందిన ఎద్దును చిరుతపులి దాడి లో మృతి చెందింది. మంగ‌ళ‌వారం ఇచ్చోడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు లో బాధితుడికి రూ. 23,000/- నష్టపరిహారం అలాగే ముత్నూర్
గ్రామానికి చెందిన ఎన్‌.కేశ‌వ్ కు చెందిన దూడ చిరుతపులి దాడిలో మరణించి నందుకు 12,000/- నష్టపరిహారాన్ని ఇచ్చోడ ఎఫ్ఆర్ ఓ టి. పుండ‌లిక్ అంద‌జేశారు.ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ‌న్య ప్రాణులన్నింటి కాపాడాలని, ఏమైనా పశువులు వన్యమృగం దాడిలో మరణించి వుంటే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలపాలని వారికి ప్రభుత్వం తరుపున నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *