సిరా న్యూస్,మంథని;
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించి ప్రారంభించిన రామ మందిర దర్శనానికి మంథని బిజెపి శ్రేణులు సోమవారం రాత్రి తరలి వెళ్లారు. బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు అయోధ్యలో బాల రామ మందిర దర్శనం కోసం బిజెపి పార్టీ కేంద్ర నాయకత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్లో మంథని పట్టణ బిజెపి శ్రేణులు రామగుండం రైల్వే స్టేషన్ నుండి తరలి వెళ్ళగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి నాయకులు ప్రదీప్ రావు, కందుల సంధ్యారాణి లు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. మంథని నుండి అయోధ్యకు తరలి వెళ్లిన వారిలో బిజెపి మంథని పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,నాయకులు ఎడ్ల సాగర్, సురేందర్, గురువేశ్ లతో పాటు నియోజకవర్గ స్థాయిలో దాదాపు 100 మంది రామభక్తులు తరలి వెళ్లారు.