మునిసిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలలి !

జీవోలు విడుదల చేయాలి,!

 సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
మునిసిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఎ.పి.మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మునిసిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డి. సోమసుందర్ మాట్లాడుతూ ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ తాత్కాలిక భృతిని వెంటనే ప్రకటించాలని, మునిసిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా దాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. పీఆర్సీ తాత్కాలిక భృతిని అందరికీ వర్తింప చేయాలని కోరారు. ఫిబ్రవరి 16 వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మునిసిపల్ కార్మికులు తిరిగి రోడ్డు ఎక్కాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోలు విడుదల చేయాలని కోరారు . జీవోలు విడుదల చేయనిపక్షంలో మరోసారి సమ్మెకు సిద్ధంగా ఉండాలని కార్మికులను కోరారు.
మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ని పర్మనెంట్ చేయాలని కోరారు.
కార్యక్రమానికి మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొడమంచిలి చంద్రరావు, ఎం.కాటమరాజు, యు.నాగరాజు, అల్లం నరేంద్ర, ముత్యాల జగదీష్, రౌతు రాజేష్, శివశంకర్, బొబ్బిలి రామాంజనేయులు, కళింగ శ్రీను, ధనాల రవి, తాడికొండ ప్రవీణ్, రమణ, లక్కవరపు శ్రీను, రామకృష్ణ, అల్లం వీర వెంకటలక్ష్మి, విజయ, సావిత్రి, శారమ్మ, కోటమ్మ, తదితరులు నాయకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *