వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కె.సురేంద్ర పి.బాలదేవ్
 సిరా న్యూస్,అరకులోయ;
ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, చిపుళ్లతో 24 రకాలు ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్.ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ పరిధిలో ఆదివాసులు సేకరిస్తున్న చింతపండుకు కిలో 60 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ప్రతి సంతలో చింతపండు కొనుగోలు కేంద్రాలు జిసిసి ఏర్పాటు చేయాలని ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటకు కిలో 200 రూపాయలు కొనుగోలు చేయాలని వారపు సంతల్లో దళారుల మోసాలను అరికట్టాలని జిసిసి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు చీపుళ్ళు, ఉసిరికాయ, ఇతర అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సంతల్లో జరిగే కార్యక్రమంలో ఆదివాసి రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *