సిరా న్యూస్ కుందుర్పి
పల్లె, పల్లెల్లోను టీడీపీ జెండా ఎగరాలి
* ఎంఎల్ ఏగా ఉమాన్నను గెలిపించాలి
*ఎనుములదొడ్డి, గురువేపల్లిలో పార్టీ ప్రచారం
పల్లె, పల్లెల్లోను టీడీపీ జెండా ఎగరాలని ఎనుములదొడ్డి టీడీపీ నాయకులు చాంద్ భాష అన్నారు. మంగళవారం రాత్రి
కుందుర్పి మండలంలోని క్లస్టర్-09లో గురువేపల్లి, ఎనుములదొడ్డి గ్రామాల్లో బాబు ష్యూరిటీ…భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి, ష్యూరిటీ బాండ్లను పంపిణీ చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ఉమాన్న ను ఎంఎల్ ఏగా గెలిపించాలని స్థానిక పార్టీ కార్యకర్తలు ఎనుములదొడ్డి, గురువేపల్లి గ్రామాల్లో ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎనుములదొడ్డి టీడీపీ నాయకులు చాంద్ భాష, వెట్టి హనుమంతరాయుడు, తలారి హనుమంతరాయుడు, ఎస్.మల్లాపురం నాగేంద్ర, జంబుగుంపల బీఎల్ ఏ విజయ్ కుమార్, టీఎన్ ఎస్ఎఫ్ మండల కార్యదర్శి సునీల్ కుమార్, గురువేపల్లిలో స్థానిక పార్టీ నాయకులు బి. శివలింగ, బీఎల్ఏ రాజు, సురేష్, శివలింగ, ఆర్టీఎస్ కోఆర్డినేటర్, మాయదార్లపల్లి B.తిప్పేస్వామి, ప్రదీప్, నాగరాజు, రుద్రంపల్లి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.