సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దాంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. – సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అతి కష్టంపై మంటలను అదుపు చేయగలిగారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో మరో కంపెనీకి కూడా మంటలు వ్యాపించాయి.