రైతుకు తీవ్ర గాయాలు
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, యల్లంపల్లిలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసి పంట పొలాలను నాశనం చేశాయి. పంట పొలాల వద్ద రాత్రి కాపలా ఉన్న రైతు మనోహర్ రెడ్డి పై ఏనుగులు గుంపు దాడి చేశాయి. ఏనుగుల అరుపులు విన్న గ్రామస్తులు పొలాల వద్దకు చేరుకుని డప్పులు కొడుతూ కేకలు వేయడంతో ఏనుగులు గుంపు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లాయి. ఏనుగుల దాడి నుండి ప్రాణాలతో బయటపడిన రైతు మనోహర్ రెడ్డికి కుడి చెయ్యి విరగడంతో గ్రామస్తులు హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నెల రోజులుగా 18 ఏనుగుల గుంపు చుట్టుపక్కల గ్రామాలలో పంట పొలాలు నాశనం చేస్తున్నాయని, గ్రామం విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.