సీరా న్యూస్ భీమదేవరపల్లి
పరిశుభ్రతను పాటించాలి
*గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్
ప్రజలు సహకరించి పరిశుభ్రతను పాటించాలని మల్లారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన పారిశుద్ధ పనుల స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ముగిసింది..ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ పనులు నేటితో ముగిసాయని, పారిశుద్ధ ప్రక్రియ ఒక్క రోజుతో ముగిసేది కాదని నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు.. ప్రజలు సహకరించి పరిశుభ్రతను పాటించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుగులోతు లలితా శ్రీనివాస్, సెక్రటరీ రాజు, మహిళా సంఘం నాయకురాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్, గ్రామపంచాయతీ సిబ్బంది, వివోలు, తదితరులు పాల్గొన్నారు.