సిరా న్యూస్,నంద్యాల;
విశ్వానికి, ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి, అక్షరాల ఆదిదేవత, విద్యాది దేవత, పుస్తక పాణి, యజ్ఞప్రదాయని అయిన శ్రీ సరస్వతి దేవి జన్మదిన మాఘశుద్ధ వసంత పంచమి. సరస్వతి అమ్మవారు ఈ ఘడియల్లోనే వేదాలకు ముందు విశ్వ సృష్టి క్రమంలో బ్రహ్మ చేతుల మీదుగా జన్మించిన ఈరోజును శ్రీ పంచమి, మదన పంచమి పేరుతో సకల దేవతలు ఆరాధించారు. భారతదేశంలో ఉన్న మూడు సరస్వతి ఆలయాలలో మన రాష్ట్రంలో నల్లమల్ల అరణ్యం ఆత్మకూరు అటవీ, రెవెన్యూ డివిజన్ పరిధిలో వెలసిన శ్రీ కొలనుభారతి సరస్వతి క్షేత్రానికి వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. విశ్వంలోని ఐదుగురు ప్రకృతి వన దేవతల్లో సరస్వతి అమ్మవారిది మూడవస్థానం సప్త ఋషులు ఈ ప్రాంతంలో యజ్ఞాలు చేసే క్రమంలో ఆటంకం ఏర్పడింది. దీంతో సరస్వతి అమ్మవారు స్వయంగా కొలనుభారతిలో యజ్ఞాన్ని ఆటంకం లేకుండా పర్యవేక్షించిందని పురాణాల్లో చెప్పబడింది. అప్పటినుంచి ఈ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయని వేద పండితులు చెబుతారు. మహాశక్తి సరస్వతి దేవి ఆవిర్భవించిన పవిత్ర దినమే ఈ వసంత పంచమి. గర్భాలయంలో అమ్మవారి మూల విరాట్ ను చారు ఘోషిని నదీ జలాలచే వేద పండితులు అభిషేకించారు .నవవిధ పుష్పాలతో అలంకరణ చేశారు. బ్రహ్మ ముహూర్తంలో శ్రీశైలం దేవస్థానం ఆలయ సూపరింటెండెంట్ స్వాములు, వేద పండితులు చేరుకొని అమ్మవారికి పట్టు శ్వేత వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ప్రధాన అర్చకులు వాసు శర్మ పూర్ణ కుంభ స్వాగతం తధానంతరం వేద మంత్రోచ్ఛారణ అమ్మవారికి అభిషేక అర్చనలు సాయి అనంతరం చిన్నారులకు అక్షర బ్యాస క్రతువులను వేద పండితులు సంప్రదాయంగా నిర్వహించి చిన్నారులతో బీజాక్షరాలను రాయించారు. తరలి వచ్చిన వేలాది భక్తులకు దేవస్థానం అమ్మవారి ప్రసాద వితరణ చేపట్టగా ఈసారి కొత్తూరు సుబ్బరాయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం జూటూరు స్వామి ఆర్యవైశ్య అన్నదాన సంస్థలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాయి