సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఘటన
సిరా న్యూస్,షాద్ నగర్;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 5 వ తరగతి చదువుతున్న దివ్యకాంత్ అనే విద్యార్థి రాత్రి నుండి తీవ్ర విరేచనాలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్ తరలించే లోపు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి సొంత గ్రామం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కల్లెపల్లి గ్రామం కాగా హాస్టల్ లో ఇక్కడ చదువుకుంటున్నాడు.